టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ 50 రోజులు దాటింది. ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నిజం గెలవాలి అంటూ చంద్రబాబు భార్య భువనేశ్వరితో యాత్రకు స్వీకారం చుట్టారు. చంద్రబాబు అరెస్ట్ సింపతితో పాటు ఎన్టీఆర్ కూతురు అనే అంశం కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావించారు.
చంద్రబాబు అరెస్ట్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడం ఈ యాత్ర ఉద్దేశం. దీంతో సానుభూతి కలిసి రావడం పక్కా అని టీడీపీతో ఆటు జనసేన నేతలు భావించారు. కానీ తీరా యాత్ర ప్రారంభమై దాదాపు వారం కావొస్తున్న స్పందన మాత్రం అంతంతమాత్రమే.
యాత్రలో పలువురు మహిళలు అడుగుతున్న ప్రశ్నలకు నీళ్లు నములుతున్నారు భువనేశ్వరి. ఆమె మాటల్లో నాటకీయతే తప్ప భావోద్వేగం కనబబడటంలేదు. ఇక ముందునుండి అనుకున్నట్లుగానే రాజకీయ అనుభం లేకపోవడంతో ఆమె మాటలు ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక యాత్ర అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందన్న టాక్ నడుస్తోంది. ప్రజలు ఏం ప్రశ్నలు అడగాలో ముందుగా ప్రీపేర్ చేయగా అవే ప్రశ్నలను భువనేశ్వరిని అడుగుతుండగా ఇదంతా పక్కా స్క్రిప్ట్ అని అర్థమవుతోందని ప్రజలే గుసగుసలాడుతున్నారు. మొత్తంగా నిజం గెలవాలి యాత్ర ఫేయిల్ అయినట్లేనని టీడీపీ నేతలు భావిస్తుండగా నెక్ట్స్ స్టెప్ ఏం తీసుకుంటారోనని తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.