Tuesday, April 30, 2024
- Advertisement -

జగన్ బస్సుయాత్ర పున:ప్రారంభం

- Advertisement -

ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పున:ప్రారంభమైంది. శనివారం రాళ్ల దాడి తర్వాత గన్నవరం నుండి బస్సుయాత్ర తిరిగి ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలతో మాట్లాడారు ముందుకు సాగారు జగన్. జననేతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శ‌నివారం రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తి జ‌గ‌న్ పై రాయి దాడి చేసిన సంగతి తెలిసిందే. జ‌గ‌న్ కంటి పైభాగంలో తీవ్ర గాయ‌ంకాగా డాక్టర్ల సూచన మేరకు ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా నుండి యాత్రను ప్రారంభించారు జగన్.

ఇవాళ గ‌న్న‌వ‌రం, ఆత్కూర్‌, వీర‌వ‌ల్లి క్రాస్‌, హ‌నుమాన్ జంక్ష‌న్‌, పుట్ట‌గుంట మీదుగా జొన్న‌పాడు వ‌ద్ద‌కు బ‌స్సు యాత్ర సాగనుంది. గుడివాడ‌లో బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొని ప్రసంగించనుండగా రాత్రి 8గంట‌ల సమయానికి కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్ర‌వేశించనుంది. బ‌స్సు యాత్ర‌పై రాయిదాడి నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -