Saturday, May 4, 2024
- Advertisement -

20వ రోజు జగన్ మేమంతా సిద్ధం యాత్ర

- Advertisement -

రెండోసారి అధికారమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఇవాళ బస్సుయాత్ర విశాఖపట్నం జిల్లాలో జరగనుంది. విశాఖలోని పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ, తూర్పు, భీమిలి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

శనివారం అనకాపల్లి జిల్లా చిన్నయపాలెంలో బస చేసిన జగన్ పినగాడ జంక్షన్ మీదుగా విశాఖలో ప్రవేశించనుంది. అక్కడినుండి పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ కు బస్సుయాత్ర చేరుకుంటుంది. జంక్షన్ దాటిన తరువాత భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం ఎన్ ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెంకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -