Saturday, April 27, 2024
- Advertisement -

కుప్పం నుండే బై బై బాబు!

- Advertisement -

తాను నమ్ముకుంది మిమ్మల్ని, దేవుడిని మాత్రమేనన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన జగన్..టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ మాత్రం పవన్‌ని, అసత్యపు ప్రచారాన్ని మాత్రమే నమ్ముకుందన్నారు. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్య భువనేశ్వేరే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

తాము పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయనివ్వకుండా 1,191 కేసులు వేయించారని కానీ మీ బిడ్డ మీ సొంతింటి కల సాకారాన్ని నెరవేర్చాడని తెలిపారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన వాటిని అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు.

14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు తానే చేసిన ఒక్క మంచి పని గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని విమర్శించిన జగన్.. వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువన్నారు. తాను చంద్రబాబులాగా దళారీలను నమ్ముకోలేదన్నారు. కుప్పం నుండే బాబు బై బై అంటున్నారని… మనం సిద్ధం అంటుంటే బాబు భార్య భువనేశ్వరి సిద్ధంగా లేమని అంటున్నారని నవ్వులు పూయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -