Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు..చంద్రముఖి లాంటోడు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుపై తన దైన శైలీలో విరుచుకపడ్డారు ఏపీ సీఎం జగన్. దెందలూరులో సిద్దం బహిరంగ సభలో మాట్లాడిన జగన్..చంద్రబాబు చంద్రముఖి లాంటోడని..లకలక అంటూ పేదల కడుపు కొట్టడానికి మళ్లీ అబద్దాలతో వస్తున్నాడని మండిపడ్డారు. రామయణ, మహాభారతంలో విలన్లంతా ఏపీలోనే ఉన్నారని…మన రాష్ట్రాన్ని ఆ విలన్ల నుండి రక్షించాలని పిలుపునిచ్చారు.

దుష్టచతుష్టంయంపై యుద్ధం చేస్తున్నానని, ఆ యుద్దానికి మీరు సిద్దమా అని ప్రశ్నించారు. పేదల భవిష్యత్‌ని కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి అంతా సిద్ధం కావాలన్నారు. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని..ఇక్కడికి వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే జగన్ ఒంటరి వాడు కాదనిపిస్తుందన్నారు.

మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చేసిన అభివృద్ధి.. మన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలపాలన్నారు. లంచాలు లేని పథకాలు అమలు చేస్తున్నది మీ జగన్ అని చెప్పాలన్నారు. మేనిఫెస్టోను 100శాతం అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని…అభివృద్ధి మీద టీడీపీ దండయాత్ర చేస్తోందని చురకలు అంటించారు. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలిచి తీరాలని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -