Sunday, May 19, 2024
- Advertisement -

పల్లకి మోయడానికే పవన్‌..!

- Advertisement -

టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ లిస్ట్‌తో జనసైనికులు పూర్తిగా నిరాశ చెందారు. పొత్తులో భాగంగా కనీసం 60 స్థానాల్లో పోటీ చేస్తామని నేతలు భావించారు. కానీ తీరా చూస్తే కేవలం 24 స్థానాలకే ప్యాకేజ్ స్టార్ పవన్ పరిమితమైపోయారు. దీంతో జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు ఎత్తు ముందు పవన్ చిత్తయ్యాని, ప్యాకేజీకి అమ్ముడు పోయారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ పనికొస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జనసేన, టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారో చూడాలి జనసేనకు ఫస్ట్ లిస్ట్‌లో 24 సీట్లు ఇస్తే అందులో కేవలం ఐదుగురి పేర్లు మాత్రమే ప్రకటించారు పవన్.ఇక జనసేనాని పేరు లేకపోవడం గమనార్హం.

చివరకు తన సీటును కూడా ప్రకటించుకులేని స్థితిలో ఉన్నారు పవన్. ఇక ఫస్ట్ లిస్ట్ తర్వాత కొన్ని చోట్ల జనసేన ఫ్లెక్సీలను ఆ పార్టీ కార్యకర్తలు చింపివేస్తూ పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు పవన్ లొంగిపోయారని, ఆయన్ని నమ్ముకుని నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -