Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబుకు చుక్కలు చూపించిన నాని!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. తిరువూరు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు నాని అనుచరులు. ఇందుకు కారణం విజయవాడ ఎంపీ సీటే. ఈసారి నానికి బదులు ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు బహిరంగ సభ జరగనుండగా ఇందుకు సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తన వర్గీయులతో కలిసి హాజరయ్యారు నాని. అయితే ఈ సమావేశంలో కేశినేని చిన్ని పేరుతో ప్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు నాని వర్గీయులు. చిన్ని ఫ్లెక్సీలు చింపేశారు. ఆయన్ని సమావేశానికి రానివ్వమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏ హోదాలో చిన్ని వస్తాడని కేశినేని నాని ప్రశ్నించారు.

అయితే వాస్తవానికి విజయవాడ ఎంపీ స్థానం విషయంలో నాన్చివేత ధోరణిలోనే ఉన్నారు చంద్రబాబు. నానికి కాకుండా చిన్నికి సీటు ఇచ్చేందుకు రెడీగా ఉండగా నాని వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సీట్ల మార్పిడి విషయంలో వైసీపీ పెద్ద ఎత్తున మార్పులు చేపడుతున్న నేతల నుండి పెద్దగా వ్యతిరేకత వచ్చింది లేదు. కానీ టీడీపీ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉంది.తమకు సీటు ఇవ్వకుండే పరిణామాలు ఎలా ఉంటాయో బహిరంగంగానే చూపిస్తున్నారు టీడీపీ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -