Saturday, May 4, 2024
- Advertisement -

నాని వర్సెస్ చంద్రబాబు..గుడివాడలో రచ్చ!

- Advertisement -

గుడివాడ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే నాని టార్గెట్‌గా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండగా తాజాగా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం మరోసారి రచ్చకు దారితీసింది.

గుడివాడలో రా..కదలి రా బహిరంగసభలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇందుకోసం భారీ జనసమీకరణకు ప్లాన్ చేసింది టీడీపీ. ఇక మరోవైపె ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు కొడాలి నాని సైతం కార్యాచరణ ప్రకటించారు. అయితే ఇద్దరూ ఒకే చోట సభలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో గుడివాడలో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.

ఇరువర్గాల సభ ప్రారంభంకాక ముందే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్వతహాగా ఎన్టీఆర్‌ అభిమాని అయిన కొడాలి నాని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్‌కు నివాళి అర్పించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేయగా ఇరువర్గాల కార్యక్రమం ముగిసేంత వరకు మాత్రం స్థానికంగా టెన్షన్ నెలకొని ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -