Monday, April 29, 2024
- Advertisement -

కోడుమూరులో టీడీపీ ఖాళీ..

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న చర్యలతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా బాటపడుతున్నారు. తాజాగా కోడుమూరులో టీడీపీ ఖాళీ అయింది.చంద్రబాబు నీచ రాజకీయాల్ని ఛీకొడుతూ వైసీపీలో చేరారు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి. కీలక నేతలు ఇద్దరూ వైసీపీ గూటికి చేరడంతో జనసేన, బీజేపీ నుంచి సపోర్ట్ దొరకక గగ్గోలు పెడుతున్నారు కోడుమూరు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి.

సీఎం జగన్ వీరిద్దరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ వైసీపీలో చేరారు. ఆ అలాగే ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, చిప్పగిరి మాజీ ఎంపీపీ భీమలింగప్ప చౌదరి, నియోజకవర్గ నేత షీలాధరణ్, వాల్మీకి సంఘం సీనియర్‌ నేత, మాజీ జెడ్పీటీసీ దేవేంద్రప్ప, వలిగొంద మాజీ ఎం పీపీ సిద్ధప్ప తదితరులు పార్టీ కండువా కప్పుకోగా టీడీపీకి గట్టి షాక్ తగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -