సర్వే ఏదైనా…ఏ పొలిటికల్ పార్టీ అభిప్రాయం అయినా ఒక్కటే…ఏపీలో గెలిచేది జగనే. రెండోసారి జగన్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నారని ఇప్పటికే సర్వేలన్ని స్పష్టం చేశాయి. ఇక మొన్న కేసీఆర్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. తమకున్న సమాచారం ప్రకారం ఏపీలో వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని చిట్ చాట్ ద్వారా వెల్లడించారు. ఇక మొన్న కేసీఆర్, ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి.
కేసీఆర్ వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణుల్లో వైరాశ్యం నెలకొనగా ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చాయి. దీనిపై టీడీపీ నేతల స్పందన ఎలా ఉన్న ప్రజల్లో మాత్రం వైసీపీపై అనుకూలంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.