లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ స్టైలే వేరు. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఎమ్మెల్యే అవడం ఆ తర్వాత రాజకీయాల నుండి వైదొలగడం ఏదైనా సర్ప్రైజ్ నిర్ణయమే. తాజాగా జేపీ తీసుకున్న నిర్ణయం అందరిని అంతే షాక్కు గురిచేస్తోంది.
ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులకు మద్దతిచ్చారు. రీసెంట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇంటర్వ్యూ చేసిన ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.
సనత్నగర్లో కోట నీలిమ, ఖైరతాబాద్లో విజయారెడ్డి,కంటోన్మెంట్లో జీవీ వెన్నెల(కాంగ్రెస్)కు మద్దతివ్వగా సికింద్రాబాద్లో మేకల సారంగపాణి,ఉప్పల్లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మల్కాజ్గిరిలో ఎన్ రామచందర్ రావు(బీజేపీ),జూబ్లీహిల్స్లో మాగంటి గోపినాథ్,మేడ్చల్లో మల్లారెడ్డి(బీఆర్ఎస్),కూకట్పల్లిలో ప్రేమ కుమార్(జనసేన),అంబర్పేటలో ప్రొ.అన్వర్ ఖాన్(బీఎస్పీ)లకు మద్దతు ప్రకటించారు. జేపీ ఇలా అన్ని పార్టీల అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి.