Monday, April 29, 2024
- Advertisement -

విజయవాడ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం!

- Advertisement -

విజయవాడ పాలిటిక్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరగా నానికే టికెట్ కన్ఫామ్ చేశారు సీఎం జగన్. ఇక నాని వైసీపీలో చేరికతో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఎంపీ సీటు కన్ఫామేనని ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. ఇక చిన్ని ఒకడుగు ముందుకేసి నానిపై తీవ్ర విమర్శలు కూడా చేశారు.

ఈ క్రమంలో అనూహ్యంగా విజయవాడ ఎంపీ రేసులో నందమూరి వారసురాలు వచ్చేసింది. ఎన్టీఆర్ మనవరాలు,హరికృష్ణ కుమార్తె సుహాసిని విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉంది టీడీపీ.2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుండి పోటీ చేశారు సుహాసిని. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా రాజకీయాల్లో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు.

ఇక ఈసారి విజయవాడ ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ నేతలు..సుహాసినిని బరిలోకి దించాలని దాదాపు ఫిక్స్ అయ్యారట. 2014,2019లో ఈ స్థానంలో గెలిచింది టీడీపీ. అందుకే ఆ పట్టు నిలబెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తుండగా నాని నుండి గట్టిపోటీ ఎదురుకానుంది. ఎందుకంటే విజయవాడ ఎంపీ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని నానికి మంచి పట్టుంది. అందుకే తనపై ఎవరు పోటీ చేసినా వారు ఓడిపోవడం ఖాయమని నాని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. మరి నానిని నిలువరించేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -