Sunday, April 28, 2024
- Advertisement -

లోకేష్‌ని లైట్ తీసుకోండి..నాగబాబు సంచలనం!

- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ టీడీపీ – జనసేన పార్టీల పరిస్థితి ఒకడుగు ముందుకు ముడడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అవుతారని లోకేష్ కుండ బద్దలు కొడుతున్నారు. అయితే దీనిపై పవన్‌ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ తొలిసారి మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు.

ఇటీవల విశాఖలో కాపు నేతలు, ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులతో సీక్రెట్ మీటింగ్ జరిపారు నాగబాబు. రీసెంట్‌గా ఈ విషయం వెలుగులోకి రాగా ఈ సందర్భంగా కాపు నేతలు పలువురు ఒకవేళ జనసేన -టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారని ప్రశ్నించడంతో పాటు లోకేష్ వ్యాఖ్యలను ప్రస్తావనకు తీసుకొచ్చారు.

దీనిపై మెగాబ్రదర్ నాగబాబు తనదైన శైలీలో స్పందించారు. సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చంద్రబాబు – పవన్ కలిసి నిర్ణయం తీసుకుంటారని ఈ విషయంలో లోకేష్ వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోవద్దన్నారు. లోకేషే కాదు ఇతర వ్యక్తుల అభిప్రాయానికి మనం విలువ ఇవ్వకూడదని నాగబాబు చెప్పారని తెలుస్తోంది. లేటుగానైనా లోకేష్ పై నాగబాబు చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -