Monday, May 6, 2024
- Advertisement -

టీడీపీ కండువా మిస్..నాదేండ్లపై ట్రోలింగ్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో నెంబర్ 2 నాదేండ్ల మనోహర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి సీఎంగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత పవన్‌తో కలిసి జనసేనలో చేరగా జనసేన అంటే గుర్తుకొచ్చేది పవన్‌ తర్వాత నాందేడ్ల మనోహరే.

ఇక ఏపీలో టీడీపీతో కలిసిన నడుస్తున్న జనసేన..తెలంగాణలో మాత్రం బీజేపీతో కలిసి నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్. అయితే హన్మకొండలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాదేండ్ల చుట్టూ బీజేపీ నేతలు కూర్చొని కండువా కప్పుకుని ఉండగా మనోహర్ మాత్రం ఎలాంటి కండువా కప్పుకోకుండా కూర్చున్నారు. కనీసం జనసేన కండువా కూడా కప్పుకోలేదు. అంతే ఆయనపై నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. స్టేజీపై వివిధ రకాల కండువాలు ఉండటంతో ఏ కండువా కప్పుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారని కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం తన ఫేవరేట్ టీడీపీ కండువా మిస్ అయిందనే బాధలో ఉన్నారని ఆటాడుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణలో పవన్ ప్రచారం నామమాత్రంగా సాగుతుండగా తాజాగా మనోహర్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -