రాజకీయాల్లో హుందా తనంగా ఉండాలి..ఎందుకంటే పార్టీ అధినేత చెప్పిందే వేదమని భావించి దానిని తూచా తప్పకుండా పాటిస్తారు కార్యకర్తలు. ఇక రోజుకో మాట చెబితే ప్రజల్లో కూడా చులకన అవుతారు. ఇప్పుడు సరిగ్గా పవన్ విషయంలోనూ అదే జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పాలిటిక్స్లో యాక్టివ్ అయిన పవన్..జగన్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా తన మాటల దాడిని పెంచడంలో లయ తప్పుతున్నారు.
కృష్ణ జిల్లా వారాహి యాత్రలో తాను ఎన్డీయే నుంటి బయటకు వచ్చానని ఇందుకు కారణం టీడీపీ వీక్గా ఉండటమేనని చెప్పారు. సరిగ్గా 24 గంటలు గడవక ముందే తాను ఇంకా ఎన్డీయేలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక వపన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన ప్రజల్లో పొలిటికల్ కామెడీ స్టార్గా మారిపోయారు.
రోజురోజు పవన్ చేస్తున్న విచిత్ర కామెంట్స్ చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఎన్డీయేలో ఉండాలా లేకపోతే టీడీపీతో చేతులు కలపాలా అన్నది పవన్ ఇష్టమే. అయితే రెండు రోజుల్లో పూర్తి విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేసినట్లు ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే జనసేన స్ధాపించి 10 సంవత్సరాలు అయినా నిలకడలేని విధానాలతో జనాల్లో పలుచనైపోతున్నారు పవన్. రాజకీయాల్లో ఓ సారి నిర్ణయం తీసుకుని దానిని ప్రకటిస్తే కష్టమైనా, నష్టమైనా దానికే కట్టుబడి ఉండాలి. కానీ పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ నేతలు అన్నట్లు ఇవే చివరి ఎన్నికలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.