Wednesday, May 1, 2024
- Advertisement -

ఈ ప్రశ్నలకు బదులేది..టీడీపీ నేతలకు వింత అనుభవం

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలకు అడుగడుగున చేధు అనుభవం ఎదురవుతోంది. ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తుండగా ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని తేల్చి చెబుతున్నారు.

తాజాగా తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. టీడీపీకి ఓటేయాలని కోరగా ఓ మహిళ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. టీడీపీ – వైసీపీ పాలనకు తేడా వివరిస్తూ మాట్లాడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎప్పుడైనా ఇలాంటి పాలన చూశారా…ఇది జగనన్న సర్కార్ అంటూ వివరించింది. 1 తేదీనే ఉదయం 7 గంటలకే పింఛన్లు తలుపు కొట్టి మరీ అందిస్తున్నారని చెప్పుకొచ్చింది. మీ హయాంలో జన్మభూమి కమిటీలు,ప్రజల వద్దకు పాలన ,పసుపు కుంకమ అని పేరు పెట్టి పసుపు జెండాలతో ప్రజలను తిరిగేలా చేశారని తెలిపింది సదరు మహిళ. అలాగే టీడీపీ హయంలో ఏ పథకం ఇవ్వాలన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఉంటేనే అందేది కానీ ఇప్పుడు ఎవరితో పనిలేకుండానే సంక్షేమ పథకాలు అందుతున్నాయని…అందుకే జగనన్నకే తమ ఓటు అని తేల్చి చెప్పగా టీడీపీ నేతలు బిత్తరపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -