Monday, May 20, 2024
- Advertisement -

చిరు అన్‌ఫిట్‌..పోసాని ఫైర్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి. కూటమి నేతలకు మద్దతిస్తూ చిరంజీవి మాట్లాడటాన్ని తప్పుబట్టిన పోసాని..చిరును నమ్మి కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు అని దుయ్యబట్టారు.

చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదని మండిపడ్డా పోసాని…సినిమాల్లాగే రాజకీయాలకు బిజినెస్ చేశారని ఆరోపించారు. ప్రజాసేవ అంటూ పార్టీ పెట్టి మూసేశాడని… 18మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడని దుయ్యబట్టారు. రాజకీయాలు వద్దని సినిమాల్లోకి వెళ్లి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారని…. ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా జగన్ పనిచేశారన్నారు. చంద్రబాబు అండ్ కో కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదని.. బాబు 14ఏళ్ల పాలనలో ఏం సంపద సృష్టించాడో చెప్పాలన్నారు. అర్బన్ ఓటర్లు గ్రామాల్లో పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -