Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్!

- Advertisement -

ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ తర్వాత అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా మరోవైపు ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా పులివెందులలో టీడీపీకి గట్టి షాక్ తగలనుంది. సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది.

గతంలో రెండుసార్ల వైసీపీ చీఫ్‌ జగన్‌కు ప్రత్యర్థిగా పులివెందుల నుండి పోటీ చేశారు సతీష్ రెడ్డి. అయితే ఈ సారి టీడీపీ టికెట్‌ను సతీష్‌కు కాకుండా బీటెక్ రవికి కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సతీష్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం దాదాపు ఖరారైంది.

ఇప్పటికే వైసీపీ కీలక నేతలతో చర్చలు జరిపారు సతీష్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇక సతీష్ రెడ్డి టీడీపీని వీడటం ఆ పార్టీకి గట్టిదెబ్బే. పులివెందులలో తనకంటూ చెప్పుకొదగ్గ అనుచరులు ఉన్నారు. వారితో సమావేశంలోనూ ఇదే నిర్ణయాన్ని సతీష్ చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ తరపున ఎమ్మెల్సీగా పనిచేసిన సతీష్ రెడ్డి…మండలి వైస్ ఛైర్మన్‌గా సేవలందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -