- Advertisement -
సైబర్ కేటుగాళ్లు ఏకంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫోటోతోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సజ్జనార్. జాగ్రత్త.. ముఖం చూసి మోసపోవద్దు”.. హెచ్చరించారు.
వాట్సప్లో డీపీగా తన ఫోటో పెట్టుకుని తెలిసినవాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ట్వీట్ చేశారు సజ్జనార్. అవి పూర్తిగా నకిలీ ఖాతాలని.. అలాంటి సందేశాలకు స్పందించవద్దని.. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచిస్తూ పోస్ట్ చేశారు.
నకిలీ వాట్సాప్ ఖాతాలు ప్రజల దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేసి సమాచారమివ్వాలని కోరారు సజ్జనార్.

