Monday, May 20, 2024
- Advertisement -

షాకింగ్ సర్వే..టీడీపీ ఏమో గానీ జనసేనకు షాకే!

- Advertisement -

ములిగే నక్కపై తాటిమట్ట పడ్డట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. ఓ వైపు చంద్రబాబు రిమాండ్ మరోవైపు చినబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతుండగా ఈ అవినీతి కేసుల నుండి ఎలా బయటపడాలో తెలియక తల పట్టుకుంటున్నారు టీడీపీ నేతలు. ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసినా ప్రయోజనం లేకపోయింది.

ఈ నేపథ్యంలో సర్వేల రూపంలో టీడీపీకి మరింత షాక్ తగిలింది. ఓ ప్రముఖ దినపత్రిక నిర్వహించిన సర్వేలో టీడీపీ పరిస్థితి గతంలో కంటే డేంజర్‌గా ఉందని వెల్లడించింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సింపతి వర్కవుట్ అవుతుందని భావించినా అది పెద్దగా ఉపయోగంలేదని తేలిపోయింది. ఇక గతంలో టీడీపీ 3 ఎంపీ స్ధానాలను గెలుచుకోగా ఈ సారి ఒక స్ధానానికే పరిమితం అవుతుందని సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో వైసీపీకి మొత్తం 25 స్ధానాల్లో 24 దక్కుతాయని సర్వే వెల్లడించింది.

అదే సమయంలో జనసేన ఓటు బ్యాంకు ఈసారి పెరిగినా ఖాతా తెరవడం కష్టమేనని వెల్లడించింది. అదే సమయంలో వైసీపీ ఓటు బ్యాంకు 50 శాతానికి చేరుకుంటుందని వెల్లడించింది.దీంతో ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ – జనసేన కూటమి కట్టినా ఉపయోగం లేదని తేలిపోయింది. ఏది ఏమైనా చూస్తుకుంటే ఏపీలో వైసీపీ స్ట్రాంగ్ బేస్, జగన్ ఇమేజ్ ముందు ఈ సారి టీడీపీకి పరాభవం తప్పదని తేలిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -