Tuesday, April 30, 2024
- Advertisement -

మేమంతా సిద్ధం యాత్రకు బ్రేక్!

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. జగన్ బస్సు యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. యాత్రపై రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్‌ కంటికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సూచనతో యాత్రకు స్వల్ప బ్రేక్ ఇచ్చారు.

దీంతో ఇవాళ గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం సభ రేపటికి వాయిదాపడింది. ప్రస్తుతం కేసరపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్నారు జగన్. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ…జగన్‌పై జరిగిన దాడిని ఖండించారు. తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు.

శనివారం రాత్రి విజయవాడలోని సింగ్‌నగర్‌ ప్రాంతంలో దాభాకొట్ల సెంటర్‌ వద్ద ప్రజలకు అభివాదం చేస్తుండగా జగన్‌పై దుండగులు రాయితో దాడిచేశారు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. రాయి దెబ్బకు వై ఆకారంలో కనుబొమ్మపైన శరీరం చిట్లిపోయింది. విజయవాడలోని జీజీహెచ్‌లో మెరుగైన చికిత్స అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -