టీమిండియాతో టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా తలపడనున్న సంగతి తెలిసిందే. నాలుగు టీ20 సరిఈస్ల కోసం జట్టును ప్రకటించింది దక్షిణాఫ్రికా. 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఎంపిక చేశారు. ఆల్రౌండర్ మిహ్లాలీ మ్పోంగ్వానా , అండీల్ సైమ్లేన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
తొలి టీ20- నవంబర్ 8- డర్బన్ వేదికగా జరగనుండగా రెండో టీ20- నవంబర్ 10- గ్వెబెర్హాలో, మూడో టీ20- నవంబర్ 13- సెంచూరియన్లో , నాలుగో టీ20- నవంబర్ 15- జొహనెస్బర్గ్ లో జరగనుంది.
జట్లు ఇవే..
దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, అండీల్ సైమ్లేన్, లూథో సిపామ్లా, రిస్టన్ స్టబ్స్
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్ కుమార్ వైశాఖ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్, ఆవేశ్ ఖాన్
