Wednesday, May 8, 2024
- Advertisement -

ఈనెలాఖరు వరకు ఆగాల్సిందే!

- Advertisement -

టీడీపీ – జనసేన – బీజేపీ మధ్య సీట్ల పంపకాలపై ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. ఇప్పటికే జనసేన – టీడీపీ మధ్య సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాలపై దాదాపు క్లారిటీ రాగా బీజేపీ ఎంట్రీతో ఈ లిస్ట్‌కు బ్రేక్ పడింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చి తొలివారంలో ఈ మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రానుంది.

అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఎక్కువ లోక్ సభ స్థానాలను ఆశీస్తోంది. ఏడు నుంచి ఎనిమిది లోక్ సభ సీట్లు కావాలని కోరుతుండగా అన్ని ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉందా అన్నదే ప్రశ్న. ఇక బీజేపీకి 10లోపే అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తోండగా చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి.

బీజేపీ తమను వెయిటింగ్‌ మోడ్‌లో పెట్టిందని అయితే పొత్తు మాత్రం కన్ఫామ్ అయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో 2014 ఫలితాలే రిపీట్ అవుతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీతో పొత్తు కన్ఫామ్ కాగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేదానిపై మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -