Saturday, April 27, 2024
- Advertisement -

రఘురామ..ఇంకా ఆశలేలా?

- Advertisement -

నరసాపురం ఎంపీ రఘురామరాజు ఆశలు అడియాశలయ్యాయి. టీడీపీ చివరి జాబితా కూడా విడుదల కావడం, ఇందులో రఘురామకు చోటు దక్కలేదు. వైసీపీ నుండి గెలిచి రెబల్‌గా మారిన రఘురామకు ఎన్డీయే కూటమి నుండి పోటీచేసే అవకాశం దక్కలేదు. తొలి నుండి తనకు టీడీపీ లేదా బీజేపీ నుండి టికె్ట్ వస్తుందని ఆశీంచారు. కానీ తీరా నరసాపురం టికెట్‌ను భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించారు.

దీంతో విజయనగరం లోక్ సభ స్థానం నుండి అయినా తనకు దక్కుతుందని ఆశీంచారు. కానీ ఇవాళ విడుదల చేసిన జాబితాలో విజయనగరం నుండి లోక్ సభ అభ్యర్ధిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును ప్రకటించారు. దీంతో ఆర్ఆర్ఆర్‌కు మైండ్ బ్లాంక్ అయింది.

అయితే టీడీపీ -జనసేన- బీజేపీ మూడు పార్టీలు టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కూటమి అభ్యర్థుల ఎంపిక పూర్తయిన ఆర్ఆర్ఆర్ మాత్రం ఇంకా ఆశతోనే ఉన్నారట. అభ్యర్థుల, మార్పు చేర్పు వస్తే తనకు సీటు రావడం పక్కా అని చెబుతున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -