Thursday, May 9, 2024
- Advertisement -

రఘురామకు తప్పని కష్టాలు!

- Advertisement -

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు కష్టకాలం మొదలైంది. రఘురామ పేరు చెబితేనే బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అలా అని టీడీపీ -జనసేన నేతలు సైతం ఆర్ఆర్ఆర్ పేరు వింటేనే మండిపడుతున్నారు. వాస్తవానికి వైసీపీతో విభేదించి టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు రఘురామ. కొన్నిసార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు బీజేపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కానీ బీజేపీలో కూడా రఘురామరాజుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ నేతల సమాచారం ప్రకారం ఆ పార్టీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, కేతినేని సురేంద్ర, నిర్మల, శాంతారెడ్డి, దయాకర్ రెడ్డి ,పాకా సత్యనారాయణ వంటి నేతలు రఘురామ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ రఘురామ పార్టీలోకి వచ్చనా ఆయనకు నరసాపురం టికెట్ ఇస్తే సహించేది లేదని తేల్చిచెబుతున్నారు.

అయితే రఘురామకు కేంద్ర బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఈ సంబంధాలతోనే టికెట్ కోసం రఘురామ ప్రయత్నిస్తుండగా ఒకవేళ ఆయనకు సీటు వస్తే చిత్తుగా ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రఘురామ భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -