Thursday, May 2, 2024
- Advertisement -

చంద్రబాబు మర్డర్ ప్లాన్..నవ్విపోదురు గాక నాకేంటీ!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత టీడీపీ నేతలతో పాటు బాబు కుటుంబ సభ్యులు పూర్తి నైరాశ్యంలో పడిపోయారు. బాబును బయటికి తేవడమే కర్తవ్యంగా పెట్టుకున్న టీడీపీ నేతలు ప్రధానంగా డే 1 నుండి చేస్తున్న ఆరోపణ బాబు భద్రత, ఆరోగ్యంపైనే. జైల్లోనే చంద్రబాబును హతమార్చే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నా ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోతున్నారు.

దోమలతో చంద్రబాబును చంపే కుట్ర జరుగుతోందని ఓ సారి, బాబు అనారోగ్యంతో వెయిట్ లాస్ అయ్యారని మరోసారి, ఇక ఇతర ఖైదీలతో బాబు ప్రాణాలకు ముంపు పొంచి ఉందని ఇలా రోజుకో ఆరోపణలు చేశారు. కానీ ఇవన్నీ బేస్ లేస్ అని తేలిపోగా తాజాగా మరోసారి బాబు మర్డర్ ప్లాన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదు అంశంపై స్వయంగా చంద్రబాబే జడ్జికి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది.

తన ఆరోగ్యం, భద్రత పై ఆందోళనగా ఉందని, తాను జైలుకు వచ్చినప్పుడు అనధికారంగా వీడియోలు, ఫోటోలు తీశారని లేఖలో ప్రస్తావించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా రాజమండ్రి జైలులో బాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు.ఆయనకు సపరేట్ బ్యారక్ కేటాయించారు. బాబు ఉన్న పరిసరాల్లోకి కనీసం ఎవరిని అనుమతించడం లేదు. ఇక ఫుడ్, మెడిసిన్స్ అంతా ఇంటి నుండే. ఇలాంటి క్రమంలో టీడీపీ నేతలు బెయిల్ కోసం బాబు భద్రత అంటూ పదేపదే పాడిన పాటే పాడుతుండటం అందిరి చేత నవ్వు తెప్పిస్తోంది. అందుకే వైసీపీ నేతలు బాబు భద్రత అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు. మరి చంద్రబాబు మర్డర్ ప్లాన్ విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకొని భద్రతను పెంచుతుందా లేదా లైట్ తీసుకుంటుందా వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -