Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబుతోనే తేల్చుకుంటా..మాజీ మంత్రి ఫైర్

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు రోజుకో కొత్త తలనొప్పితో చిక్కొచ్చి పడింది. ఫస్ట్ లిస్ట్ ఎఫెక్ట్ చల్లారకముందే సెకండ్ లిస్ట్‌లో అసంతృప్త నేతలతో బాబుకు కొత్త చిక్కొచ్చి పడింది. ముఖ్యంగా సీనియర్ నేతలకు టికెట్ కేటాయించడం,వారిని దారిలోకి తేవడం బాబుకు పెను సవాల్‌గా మారింది.

ఇక తాజాగా పుట్టపర్తి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి, సీనియర్ నిమ్మల కిష్టప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. పుట్టపర్తి టికెట్‌ను ఆశీంచారు కిష్టప్ప. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరరెడ్డికి పుట్టపర్తి టిక్కెట్ ఖరారు చేశారు చంద్రబాబు.

దీంతో చంద్రబాబు చేనేతలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిమ్మల కిష్టప్ప. గోరంట్ల లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన..అనుచరులంతా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటానని…ఒకవేళ అప్పటికి చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో ఉండేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -