సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైసీపీలో చేరుతుండగా తాజాగా స్వతంత్ర అభ్యర్థుల బెడద తప్పేలా కనిపించడం లేదు. టికెట్ దక్కని కొంతమంది నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.
తాజాగా రాజంపేట అసెంబ్లీ స్థానానికి సుగవాసి సుబ్రమణ్యంను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. దీంతో స్థానికంగా అసమ్మతి రాజుకుంది. టికెట్పై ఆశలు పెట్టుకున్న బత్యాల చెంగల్రాయుడు ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు.
తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడుకి ఈసారి పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. దీంతో వారి అభిప్రాయంపై ఓ నిర్ణయానికి వచ్చారట చెంగల్రాయుడు. పార్టీకి కాపాడుకుంటు వచ్చిన తనకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని అనుచరులతో వాపోయరాని తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసి బరిలో ఉంటానని అనచరులతో తెలపగా ఇందుకు సంబంధించిన ప్రకటన రావడమే తరువాయి.