Saturday, April 27, 2024
- Advertisement -

టీడీపీ మూడో జాబితా రిలీజ్..సీనియర్లకు షాకే

- Advertisement -

టీడీపీ మూడో జాబితా రిలీజ్ అయింది. 11 అసెంబ్లీ,13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ అభ్యర్థులు శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు, నంద్యాల – బైరెడ్డి శబరి,హిందూపురం- బీకే పార్థసారథి,గుంటూరు-చంద్రశేఖర్,నరసరావుపేట- కృష్ణదేవరాయలు,బాపట్ల-కృష్ణప్రసాద్,నెల్లూరు- ప్రభాకర్ రెడ్డి,చిత్తూరు ప్రసాదరావు,కర్నూల్ -నాగరాజు,ఏలూరు-పుట్టా మహేష్‌,విజయవాడ – కేశినేని నాని,అమలాపురం-హరీష్ మాధుర్ ఉన్నారు.

అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు,అమలాపురం- ఆనందరావు,శ్రీకాకుళం -గొండు శంకర్,శృంగవరపు కోట-కోళ్ల లలితాకుమారి,పలాస-గౌతు శిరీష,పాతపట్నం-గోవిందరావు,మైలవరం- వసంత కృష్ణప్రసాద్,పెనమలూరు- బోడే ప్రసాద్,చీరాల- మాలకొండయ్య,సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.

పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటివరకు మూడు దశల్లో టీడీపీ 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 5 అసెంబ్లీ,4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ జాబితాలోనూ టీడీపీ సీనియర్లకు నిరాశే ఎదురైంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమాతో పాటు కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -