- Advertisement -

టీటీడీ నెయ్యి టెండర్లు..వాస్తవాలివే!

- Advertisement -

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడానికి ముందు నెయ్యి కొనుగోలుకు సంబంధించి టెండర్ నిబంధనలను తీసుకువచ్చారని, అయితే వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019లో నిబంధనలను పటిష్టం చేశామని చెబితే, 2015 నుంచి 2019 మధ్య కాలంలో టీటీడీలో కల్తీ నెయ్యి ప్రవేశించిందని అంగీకరిస్తున్నట్లే కాదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

టీటీడీలో నెయ్యి కొనుగోలు టెండర్ల విధానంలోనే జరుగుతుండగా, ప్రైవేటు డైరీలు కూడా ఆ టెండర్లలో పాల్గొంటూనే ఉన్నాయని చెబుతున్నారు. రూ.319 కంటే తక్కువ రేట్లకు కూడా అనేకసార్లు టీటీడీకి నెయ్యి సరఫరా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2014-19 మధ్య చంద్రబాబు పాలనలో టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ఎవరు? వారు సూచించిన ధరలు ఏమిటి? ఆ టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందా లేదా? అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.

టీటీడీ వంటి విశ్వాసానికి ప్రతీకగా నిలిచే సంస్థలో నాణ్యత, పారదర్శకత అత్యంత ముఖ్యమని, గతంలో జరిగిన కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -