ఏపీ బీజేపీ చీఫ్,బీజేపీ నేత పురందేశ్వరిపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ బోటు ప్రమాద ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి గారూ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు… వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టం. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు.
ఇప్పటికే పురందేశ్వరి, విజయసాయి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరిని ట్విట్టర్ ద్వారా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు విజయ సాయి.
విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి గారూ? గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టం. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023