కృష్ణా జిల్లా గన్నవరం..ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సీటు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటం. టీడీపీ నుండి ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావ్ పోటీ చేస్తున్నారు.
గత రెండు పర్యాయాలు టీడీపీ నుండి గెలుపొందారు వంశీ. నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. ఇక ఈసారి కూడా గెలుపు తనదేనని హ్యాట్రిక్ కొట్టి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితేనే విమర్శల దాడి చేయడంలో ముందుంటారు వంశీ. అంతేగాదు లోకేష్ను తనదైన శైలీలో టార్గెట్ చేయడంలో దిట్ట. అందుకే వంశీని ఓడించి రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీడీపీ. అందుకే యార్లగడ్డను పోటీకి దింపి వంశీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. వంశీకి నియోజకవర్గంలో బలమైన అనుచరగణం ఉండగా యార్లగడ్డకు బలం ఉంది. ఈ నేపథ్యంలో గన్నవరం పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని రెండు పార్టీల అధినేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.