Sunday, May 5, 2024
- Advertisement -

తొలిసారి ఏజెన్సీకి సీఎం జగన్..

- Advertisement -

ఎన్నికల వేళ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ఇప్పటికే పలు పథకాలతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన జగన్..వైనాట్ 175 లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఇక తాజాగా తొలిసారి విశాఖ ఏజెన్సీలో పర్యటించనున్నారు జగన్.

ఈ నెల 21న అల్లూరి సితారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ చింతపల్లి ఆశ్రమ స్కూల్‌లో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు జగన్. ఏజెన్సీకి వైసీపీ ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతోంది అన్నది వివరించనున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాను విభజించి కొత్తగా అల్లూరి జిల్లా చేసిన తర్వాత ఏజెన్సీలో జగన్ పర్యటించడం ఇదే తొలిసారి. జిల్లాగా మారిన తర్వాత విశాఖ ఏజెన్సీలో అభివృద్దిలో ఇతర జిల్లాలతో పోటీ పడుతోంది. ప్రజలకు నేరుగా ఎలాంటి అవినీతి లేకుండా పాలన అందుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తొలిసారిగా ఏజెన్సీకి వస్తుండటంతో వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -