- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి – త్రిష కాంబినేషన్లో వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా విశ్వంభర కోసం ముచ్చింతల్ వద్ద 54 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ షూట్ చేశామని… ఆ షూట్ నుంచి చిరంజీవి, త్రిష లుక్స్, ఆంజనేయస్వామి విగ్రహం ఫోటోలు బయటకి రావడంతో అవి వైరల్ గా మారాయి.
సాధారణంగా సినిమాల్లో ఎంత పెద్ద ఫైట్ అయినా పదిరోజుల్లో తీస్తారు. కానీ విశ్వంభర ఇంటర్వెల్ యాక్షన్ సీన్ కోసం 26 రోజులు పట్టింది. ఏప్రిల్ 21తో ఈ షూటింగ్ షెడ్యూల్ ముగియగా చిరుతో పాటు అంతా కలిసి దిగిన ఫోటో వైరల్గా మారింది. ఇక చిరు కెరీర్లోనే ఓ ఫైట్ సీన్ కోసం ఇన్ని రోజులు పట్టడం ఇదే తొలిసారి.