ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో పవర్స్టార్ పవన్కల్యాణ్ నిమగ్నమవడంతో సినిమాలకు టాటా చెప్పేశాడు. అయితే ఈ విధంగా జరుగుతుందని ఊహించలేకపోవడంతో పవన్ తాను సినిమాలు చేస్తున్న సమయంలోనే పలు సినిమాల చర్చలు చేశారు. పవన్ను నమ్ముకొని కథలు వినిపించిన వారంతా ఇప్పుడు పవన్ను వదిలేసి వేరేవాళ్లను సంప్రదిస్తున్నారు.
పవన్ కోసం వేచి ఉండలేక ఇక వేరే హీరోలతో ఆ సినిమాలు చేయాలని చూస్తున్నారు. పవన్ కోసం చాలాకాలంగా కందిరీగ ఫేం సంతోశ్ శ్రీనివాస్ దర్శకుడు ఎదురుచూస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమా పవన్ అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లడంతో సంతోశ్ శ్రీనివాస్ వేరే హీరోను సంప్రదించాడు.
ప్రస్తుతం విజయవంతమైన హీరోగా ఉన్న నానిని సంతోశ్ శ్రీనివాస్ పట్టుకున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్పై రూపొందించే ఈ సినిమా నానితో తీద్దామని సిద్ధమయ్యారు. ఇప్పటికే కథ సిద్ధం చేసిన సంతోశ్ శ్రీనివాస్ నాని కోసం కొన్ని మార్పులు చేయనున్నాడు. నానికి ఈ కథ చెప్పగా చిన్నచిన్న మార్పులు చెప్పడంతో ఆ పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు. ఈ విధంగా పవన్ సినిమా నాని చేతిలోకి వచ్చి సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది.