తెలుగు తెరకు పరిచయమైన హీరోతోనే తన జీవిత ప్రయాణాన్ని సమంత కొనసాగించింది. తొలి సినిమాతో నటించిన వ్యక్తినే భర్తగా చేసుకున్న నటి సమంత. తన నటనతో ప్రేక్షకులనే కాక అక్కినేని వంశానికి నచ్చేసి ఇప్పుడు ఆ ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టేసింది. ఇప్పుడు చూడచక్కనైన జంటగా చైతు, సమంత జంటను అభివర్ణిస్తున్నారు. ఈ జంటను అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్మస్ వేడుకల్లో ఆ జంట మునిగితేలుతోంది. అయితే ఈ జంటకు అక్కినేని నాగార్జున ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారట.
తమ వ్యాపార సామ్రాజ్యం, సినిమాలకు నిలయమైన అన్నపూర్ణ స్టూడియోలో ఓ కాటేజీ నిర్మించి నాగార్జున ఆ జంటకు బహుమతి ఇస్తారంట. దానికోసం అన్నపూర్ణ స్టూడియోలో పనులు చకాచకా అయిపోతున్నాయి. వీరిద్దరి కోసం ఓ అందమైన ప్రేమ కుటీరం నిర్మించి ఇవ్వబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జునకు ఆల్రెడీ ఓ కాటేజ్ ఉంది. ఎప్పుడు స్టూడియోస్కు వచ్చినా అందులో గడుపుతారు. ఆ కాటేజీకి ఎదురుగా ఓ కొత్త కాటేజీ చేసామ్ జంటకు నిర్మిస్తున్నారట. ఆల్రెడీ కాటేజీ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టి పూర్తవవచ్చాయి. ఇతర కాటేజీలకు భిన్నంగా దీనిని ఓ డిఫరెంట్ లుక్లో తీర్చిదిద్దుతున్నారు. చూడగానే పాతకాలం నాటి భవనం అనిపించేలా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. నాగచైతన్య- సమంతల్లో ఇకపై ఎవరు అక్కడకు వచ్చినా ఆ కాటేజీలో గడపడానికి వీలుంటుందన్నమాట.
ప్రస్తుతం ఈ కొత్త జంట తమ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత రంగస్థలం, సావిత్రి సినిమాల్లో నటిస్తుండగా, చైతూ శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో బిజీగా ఉన్నారు.