Saturday, May 4, 2024
- Advertisement -

అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వానున్నాడు!

- Advertisement -

ఇటివలే సూపర్ హిట్ అయిన చిత్రం సరైనోడు. అల్లు అర్జున్, రకుల్, క్యాథరిన్‍ లు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించి 100కోట్లు వసులు కూడా సాధించింది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్నికి దర్శకత్వం వహించాడు.

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. బన్నీ అభిమానులు బన్నీ తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బన్నీ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఆ చిత్రంలో అల్లు అర్జున్ రెండు విభిన్న షేడ్ లున్న క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఒకటేమో పూర్తిగా పాజిటివ్ గా ఉండేదయితే…మరొక పాత్ర పూర్తిగా నెగెటివ్ షేడ్ తో సాగుతూ ఒళ్ళు గగుర్పోడుస్తుందట. విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్ బన్నీ కెరీర్ లో మైలురాయి గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇక ఈ పాత్ర కోసం బన్నీ ఉవ్విళ్ళూరుతున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -