- Advertisement -
సౌత్ ఇండస్ట్రీ నుండి దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్లో కొలువుదీరిన తొలి నటుడిగా చరిత్ర సృష్టించాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రఖాత్య మేడమ్ టుస్సాడ్స్లో ఇవాళ బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
లండన్లోని మేడమ్ టుస్సాడ్స్లో ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉండగా దక్షిణాది నుండి తొలిసారి ఓ హీరో దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్లో చోటుఉ దక్కించుకున్నారు. ఇదే మ్యూజియంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి.
విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. బన్నీ మైనపు విగ్రహాం కోసం 200 రకాల మెజర్మెంట్స్ని తీసుకున్నారు. బన్నీ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.