Sunday, April 28, 2024
- Advertisement -

మహేష్ పై అల్లు కాంపౌండ్ సీరియస్

- Advertisement -

స్పైడర్ ఫ్లాప్ … నిర్మాతలు, బయ్యర్లను కోలుకోలేకుండా చేసింది. సర్వత్రా ఈ సినిమా గురించి విమర్శలు వస్తూ ఉండడంతో.. ఆ కామెంట్లు రేపన్న రోజు తనపై పడకుండా ఉండాలని మహేష్ ముందుగా ఓ అడుగు ముందుకు వేసాడు. రజనీకాంత్ మాదిరిగా తాను తీసుకున్నరెమ్యునిరేషన్ ను వెనక్కి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడు. దానిలో బాగంగానే 23కోట్ల మొత్తాన్ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ కి ఇచ్చేస్తున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుత చిత్రం భారత్ అనే నేను సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కు ముందు కొంత నష్టాన్ని భర్తీ చేస్తానని మహేష్ ఎన్వీ ప్రసాద్ కు మాట ఇచ్చారట. మహేష్ గతంలో కూడా తన నిర్మాతలకి హెల్ప్ చేశాడు. అయితే ఆ విషయం ఆ టైమ్లో అంతగా బయటకు రాలేదు. అఖిల్ ఫ్లాప్ అయితే డైరెక్టర్ వినాయక్… ఎలా అయితే నితిన్ కు మనీ వెనక్కి తిరిగి ఇచ్చేసాడో …అదే విధంగా ఇప్పుడు మహేష్ ఇస్తుండటం చూస్తుంటే.. ఆనాటి కాలంలోని సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు వస్తున్నాడు. ఆయన కూడా ఇలాంటి పనులే చేసి ఆర్ధికంగా చాలా వెనకపడి పోయాడు. అయితే మహేష్ కృష్ణగారంతా అమాయకుడు కాదు కాబట్టి.. ఇప్పటికే ఫైనాన్సియల్ గా సేఫ్ జోన్లోకి వచ్చేశాడు. ఈ అమౌంట్ ఇచ్చేయడం ద్వారా ప్రిన్స్ కు పెద్దగా పోయిందేమి లేదు.

మహేష్ ఇలా చేయడం మంచిదేయిన… ఈప్రభావం ఇతర హీరోలపై కూడ పడేఅవకశం లేకపోలేదు. ఈప్రభావం మొదటగా మెగా, అల్లు కాంపౌండ్ పై పడుతుంది. అయితే ఇప్పుడు అల్లు కాంపౌండ్ మహేష్ పై సీరియస్ గా ఉన్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -