జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా క్రేజ్ సంపాధించుకున్నారు… అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్. వీరిద్దరికి అసలు పడట్లేదట.. ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాలు ఇదే అంటున్నారు. అనసూయ, రష్మీ కి అసలు పడట్లేదని. అయితే ఇండస్ట్రీలో యాంకర్ల హవా నడుస్తుంది. వారిలో మొదట సుమ ఉంటే ఆ తరువాతి స్థానంలో అనసూయ వుంది. అయితే సుమ తర్వాత స్థానం కోసం చాలా మంది యాంకర్లు ప్రయత్నిస్తున్నారు. అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం అనసూయకు బానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే అనసూయకి ఏ మాత్రం తీసిపోననని యాంకర్ రష్మీ అంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో రష్మీకి పెద్దగా గుర్తింపు లేదు. అయితే జబర్దస్త్ షో ద్వారా బాగా ఫాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం రష్మీ కన్నా అనసూయకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంట. అంతే కాకుండా రష్మిని ఇండస్ట్రీలో తొక్కేయాలని అనసూయ భావిస్తుందంట. రష్మీ ఒక్కతే తనకి పోటీ ఇస్తుందని తాను కూడా లేకపోతే తనకి ఎదురే ఉండదని అనసూయ భావిస్తుందంట.
అయితే రష్మీ కూడా ఆఫర్ల కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూనే వుంది. తనకున్న సర్కిల్ వాడుకొని టీవీ షోలు చేస్తుంది. అయితే మేజర్ ఈవెంట్స్ అన్ని అనసూయ చేస్తుండడం, తనకి ఆఫర్లు రాకుండా చేయడంతో రష్మీకి కోపం కట్టలు తెంచుకుందంట. అంతే ఇక తాను కూడా అనసూయని ఫాలో అవుతుందంట. ‘రష్మీ మీకు పోటీ ఇస్తుందా’ అని అనసూయని అడిగితే “ఒకరితో నాకు పోటీ ఏంటండీ” అని అంది., నిన్న రష్మీని ఇదే విషయంపై అడిగితే “ఒకరితో పోలిక నాకేంటి, వాళ్ళ స్థాయి చూసుకోమనండి” అని ఘాటుగానే స్పందించింది. వీరి మాటలు చూస్తుంటే వీరిద్దరి మద్య గొడవ తారాస్థాయికి చేరిందని తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి ఈ గొడవ ఎప్పటికి సర్దుగుమణుగుతుందో..?
Related