టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. పొలిటికల్ గా కూడా పవన్ బలపడే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వడంతో అందరూ పవన్ పై అభిమానాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతి సమస్యపై తన వాడిని వినిపించే విధంగా పక్కాగా ప్రణాళిక రచిస్తున్న తరుణంలో… పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయ్యింది బుల్లి తెర యాంకర్ ఝాన్సీ.
అసలు ఝాన్సీ ఎందుకు పైర్ కావాల్సి వచ్చింది..? అసలు ఏమైయింది.. విషయంలోకి వెళ్తే… పవన్ ఫ్యాన్స్ ఝాన్సీ కి ఎందుకు కోపం తెప్పించారంటే.. ఇటివలే విజయవాడలో జరిగిన రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ ఆడియో వేడుకకు ఊహించని రెంజ్ లో అభిమానులు వచ్చారు. అయితే ఈ క్రమంలో అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ ను వీక్షించడం జరిగింది… అయితే ఆ వేడుకను భంగ పరచడానికి కొంతమంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూ కొంత రగడ చేసేలా వ్యవహరించడంతో.. యాంకర్ ఝాన్సీ కి చిరాకు పుట్టింది.
కోపంతో ఊగిపోయిన ఈ యాంకర్ ఆ రగడ సృష్టిస్తున్న వారి పై ఘాటైన కామెంట్స్ చేసింది. ‘విజయవాడ వస్తే ఇలాగేనా గౌరవించేది..?’ అంటూనే ఆ గుంపులో కొంతమంది పవన్ కల్యాణ్ పోస్టర్లు పట్టుకొని కనిపించడంతో ‘క్రమశిక్షణ ఆయుధంగా మీ హీరో మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఆ హీరోకి మచ్చలా తయారయ్యారు. ఈ కొంత మంది వల్ల ఆయన అభిమానులకు చెడ్డపేరు వస్తుంది. మీరంతా మచ్చ తనకలు’ అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది ఝాన్సీ. దీంతో పవన్ అభిమానులతో పెట్టుకుని ఝాన్సీ పెద్ద సాహసమే చేసింది అని ఆ కార్యక్రమంకు వచ్చిన చాలా మంది కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Related