Tuesday, April 30, 2024
- Advertisement -

ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశాడు!

- Advertisement -

బాహుబలి సినిమా చూసిన ప్రతి వ్యక్తికి కలిగే మొదటి ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని? ఐతే ఈ ప్రశ్నకు సమాదానం బాహుబలి సెకండ్ పార్ట్‌లో రివీల్ చేయబోతున్నారు. ఐతే సినీ పరిశ్రమలోను అలాగే సినీ లవర్స్‌‌లో మాత్రం ఆ సస్పెన్స్ వీడలేదు. ఈ విషయంపై ఆరునెలలుగా సోషల్ మీడియాలో ఎక్కడోదగ్గర చర్చ జరుగుతునే ఉంది.

ఈ పాయింట్ గురించి యూనిట్ ప్రస్తావించడం కూడా మరింత ఆసక్తిని రేపింది. ఆయుధం కంటే పదునైనది వెన్నుపోటని.. ‘బాహుబలి’ని తాను చంపానని కట్టప్ప చెప్పినప్పటికీ.. అదేంకాదని తెలుస్తోంది. ఐతే ఈ సినిమాకి కథ అందించిన జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటివలే బాహుబలి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశాడు. అదేంటంటే బాహుబలి బతికి వుండొచ్చేమో అంటూ అయన అన్నారు.

రైటర్ చెప్పిన ప్రకారం ‘బాహుబలి’ ఎక్కడున్నాడు? బాహుబలికి వెన్నంటే‌వున్న కట్టప్పను నమ్మకద్రోహి అని సామంతరాజులు ఆడిపోసుకున్నా.. దేవసేన మాత్రం కట్టప్పను నమ్ముతూనే వచ్చింది.  రైటర్ కథనం ఇదే ఐనప్పటికీ, జక్కన్న మాత్రం సెకండ్ పార్ట్‌లో బాహుబలిని బతికిస్తాడా? లేక చంపేస్తాడా అన్నది సస్పెన్స్. సో మరి ఈ విషయంపై క్లారీటి రావాలి అంటే బాహుబలి సెకండ్ పార్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -