Saturday, May 4, 2024
- Advertisement -

పోసానిపై బాలయ్యబాబు ఆగ్రహం…

- Advertisement -

నంది అవార్డుల ఎంపికపై రకరకాల వ్యక్తులు…. రకరకాలుగా స్పందిస్తూ టిడిపి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. కొందరేమో ఏకంగా కులంపైనే ఎదురుదాడికి దిగుతున్నారు. అశ్వనీదత్ లాంటి వారు ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి… డ్యామేజ్ ను కొంత వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కాని చివరకు సీన్ మరోలా మారింది. ఫైర్ బ్రాండ్ పోసాని ఈ తతంగంలోకి ఎంటర్ కావడం…తనకిచ్చిన నంది అవార్డు వద్దని చెప్పడంతో ఇష్యూ ఓ రేంజ్ కు పోయింది.

లోకేష్ ను ఉద్దేశిస్తూ..పోసాని సందించిన ప్రశ్నాస్త్రాలు డైరెక్ట్ గా టిడిపి శ్రేణులకు తగిలాయి. అవి కూడా ఓ స్థాయిలో తగలడంతో లోకేష్ బాబు అవగాహన రాహిత్యం ఏపాటిదో అందరూ నోరెళ్లబెట్టేలా చేశాయి.కేసీఆర్ దగ్గరకు పోయి రాజకీయాలంటే ఏంటో నేర్చుకో అనేవరకు పోసాని లోకేష్ ను ఉద్దేశించి డైరెక్ట్ గా చేసిన వాక్బాణాలు… ఎల్లోమీడియాకు ముందుకు కదలకుండా చేశాయి.

తన అల్లుడు విషయంలో ఎవరూ ఏమీ అనకపోయినా.. పోసాని ఇలాంటి కామెంట్లు చేయడంతో… బాలయ్య చుట్టూ ఉండే ఓ వ్యక్తి దీని గురించి బాలయ్యకు భాగా ఎక్కించాడని తెలుస్తోంది. దీంతో ఎలాగైనా సరే పోసాని నోటికి తాడు వేయాలనే ఉద్దేశ్యంతో బాలయ్య ఇన్ డైరెక్ట్ గా పోసానికి వార్నింగ్ మెసేజ్ లు తన అనచురుడి ద్వారా పంపినట్లు తెలుస్తోంది.

ఇకపై అనవసర ఆక్షేపణలు లోకేష్ పైగాని తన లెజెండ్ చిత్రంపై గాని చేసినట్లయితే…. మ్యాటర్ మరోలా ఉంటుందని చెప్పాడట. దీంతో టాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయంపై చర్చ కాస్త గట్టిగానే సాగుతుంది. మరి ఈవిషయం సోషల్ మీడియాలో మిగిలిన వర్గాలకు తెలియదా లేక తెలిసినా… మనకెందుకులే అని ధైర్యం చేయలేకపోతున్నారా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -