Wednesday, May 8, 2024
- Advertisement -

పూరికి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఎందుకు..?

- Advertisement -

టాలీవుడ్ లో డ్రగ్స్ పై వివాదం జోరు జరుగుతోంది. ముఖ్య ఈ డ్రగ్స్ కేసులో రవితేజ తమ్ముడు భరత్ ఎప్పుడు వార్తల్లో కనిపించేవారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత డ్రగ్స్ పై కొత్త న్యూస్ వినిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన స్టార్స్ ఈ డ్రగ్స్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్టార్స్ కి నోటిసులు పంపించారు. ఈ నెలలో వారిపై విచారణ జరపనున్నారు. అయితే ఈ డ్రగ్స్ విషయంలో రవితేజ, చార్మి, సుబ్బరాజు, పూరిజగన్నాథ్, రుణ్, నవదీప్, తనీష్, నందు, ముమైత్ ఖాన్, శ్యామ్ కె నాయుడు, చిన్నా, రవితేజ డ్రైవర్ – శ్రీనివాసరావు, ప్రస్తుతానికి ఈ 12 మంది పేర్లే బయటకు రావడంతో సినీ సర్కిల్ లో ప్రస్తుతం ఇదే సంచలన న్యూస్ అవుతుంది. వ్యక్తిగతంగా కార్యాలయానికి పిలిచి ప్రశ్నించబోతున్నట్లు తెలియడం నిజంగా షాకింగ్ విషయమనే అనాలి. అయితే దర్శకుడు పూరిజగన్నాథ్ కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉండటం.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ బాలకృష్ణతో.. పైసా వసుల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకు ఈ డ్రగ్స్ అంటే అసలు పడవట. అంతే కాదు.. డ్రగ్స్ తీసుకునే వారు అన్న తెగ కోపమట. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో పూరిజగన్నాథ్ పేరు వినిపించడంతో.. బాలకృష్ణ.. పూరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అంతే కాదు.. ఇలాంటి పని చేసినందుకు నానా మాటలు అనేసాడట. డ్రగ్స్ విషయంలో నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నువ్వు ఎంతో మంచోడివి అని నీతో సినిమా చేస్తున్నా.. నువ్వు అసలు ఇలాంటోడివి అని తెలిస్తే.. నీతో సినిమా చేసే వాడినే కాదాని ముఖం మీదే చెప్పాడట. బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పూరి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ డ్రగ్స్ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -