Friday, April 26, 2024
- Advertisement -

బెల్లంకొండ గణేశ్​ హీరోగా మరో సినిమా..!

- Advertisement -

బెల్లంకొండ సురేశ్​.. రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్​ బాబు సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వాలని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ అందుకోసం టైం కలిసిరావడం లేదు. వివిధ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సురేశ్​ మొదటి కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ సక్సెస్​లు అందుకోలేకపోయినా.. నటుడిగా అయితే గుర్తింపు పొందాడు. రాక్షసుడు చిత్రం సాయి శ్రీనివాస్​ కెరీర్​లో మంచి చిత్రంగా చెప్పుకొవచ్చు.

ఇక మాస్​ హీరోగా నిరూపించుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు శ్రీనివాస్​ కానీ పెద్దగా వర్కవుట్​ కాలేదు. వీవీ వినాయక్​, బోయపాటి శ్రీనివాస్​ వంటి మాస్​ డైరెక్టర్లతో సినిమాలు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. అల్లుడు శీను, జయజానకి నాయక సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన ఓవర్ బడ్జెట్ కారణంగా అవి సరైనా ఫలితం అందుకోలేదు. దీంతో విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటున్నాడు శ్రీనివాస్.

ఇదిలా ఉంటే ఆయన సోదరుడు బెల్లంకొండ గణేశ్​ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పటికే సితార బ్యానర్ మీద కొత్త దర్శకుడి సారథ్యంలో ఓ మూవీలో ఆయన నటిస్తున్నాడు.మొదటి సినిమా నిర్మాణ దశలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెప్పాడు గణేశ్​. శతమానం భవతి మూవీ హిట్ అయ్యాక దర్శకుడు సతీష్ వేగ్నేశ నిర్మాతగా మారాడు. అల్లరి నరేష్ తో నాంది మూవీ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన నిర్మాతగా గణేష్ హీరోగా చల్ మోహన రంగ ఫేమ్ కృష్ణ చైతన్యతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఇందుకోసం ఆయన కథను సిద్ధం చేశాడు. ఈ మూవీని కూడా తొందర్లోనే స్టార్ట్​ చేయబోతున్నట్టు టాక్​.

Also Read

జెర్సీ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!

ఛత్రపతి హిందీ రీమేక్.. ఇక లేనట్టేనా? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -