పబ్ లో జరిగిన గొడవ పై సీసీ టీవీ ఫుటేజ్ను రిలీజ్ చేశారు సింగ రాహుల్ సిప్లిగంజ్. ఈ సందర్భంగా ట్విట్టర్లో సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేస్తూ తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ న్యాయం చేయాలని కోరారు. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి అతని అనుచరులు రాహుల్ సిప్లిగంజ్పై బీరు బాటిల్స్లో దాడి చేశారు. స్వల్ప గాయాలతో బయటపడిన రాహుల్.. పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రెస్ మీట్లో గొడవకు గల కారణాలను తెలిపారు.
పబ్లో రాహుల్ని రౌండప్ చేసి కొట్టారని వీడియోలు చూస్తే అర్దం అవుతుంది. దీనిపై మరింత వివరణ ఇస్తూ.. బుధవారం రాత్రి పబ్లో జరిగిన గొడవకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేశారు రాహుల్ సిప్లిగంజ్. తాను పబ్లో డాన్స్ చేస్తుండగా.. అతనే ముందు వచ్చి తన్నాడని.. నేను ప్రశ్నించడంతో దాడి చేశాడని వీడియో వదిలిపెట్టాడు. ‘నాకు న్యాయం కావాలి.. పబ్లో జరిగిన గొడవపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. అందుకే ఈ వీడియో పెడుతున్నా.. తప్పు ఎవరిదో మీరే చెప్పండి. పబ్లోపల ఏం జరిగిందో వాళ్లు నన్ను రౌండప్ చేసి ఎలా దాడి చేశారో మీకు మీరుగా చూడండి. ఎవరిది తప్పో మీరే చెప్పండి.
కేటీఆర్ సార్.. నేను ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నాం… నేను ఓటు కూడా టీఆర్ఎస్కే వేశాం.. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టిపెరిగాను కాబట్టి. దయచేసి ఈ వీడియో చూసిన తరువాత మీరే న్యాయం చేయండి’ అంటూ సీసీ టీవీ ఫుటేజ్ను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లలో పోస్ట్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.