Sunday, May 19, 2024
- Advertisement -

మహేష్ ఫ్యాన్స్‌ కు సూపర్ న్యూస్!

- Advertisement -

మహేష్ బాబు తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం’ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది.

మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఐతే ఈ సినిమాని మే లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని ఈ మధ్య పక్క ప్లాన్ తో షూటింగ్ ను శర వేగంగా చేస్తున్నారు. దీంతో అనుకున్నదాని  కంటే ముందే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశిలో జరుపుకుంటుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -