Thursday, April 25, 2024
- Advertisement -

లూసిఫర్ తర్వాత మొదలయ్యే చిరంజీవి సినిమాపై క్లారిటీ..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆచార్య సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి మలయాళ రీమేక్ లూసిఫర్ సినిమా ప్రారంభించనున్నాడు. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.

లూసిఫర్ రీమేక్ కాకుండా చిరంజీవి చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. వాటికి రవీంద్ర బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. మెహర్ రమేష్ చిరంజీవి హీరోగా తమిళ వేదాళం రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్క్రిప్టు కూడా మెహర్ రమేష్ సిద్ధం చేశాడు. బాబీ కూడా చిరంజీవి కోసం ఓ స్క్రిప్టు రెడీ చేశాడు. దీనికి వీరయ్య అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు.

లూసిఫర్ రీమేక్ తర్వాత ఇద్దరు దర్శకులు లైన్లో ఉండగా మొదట చిరు ఎవరికీ ఛాన్స్ ఇస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి మొదట బాబీ సినిమానే చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు. మళ్లీ వరుసగా మరో రీమేక్ చేయడం బావుండదు అని భావించిన చిరంజీవి బాబీ సినిమాని మొదట పట్టాలెక్కించాలని భావిస్తున్నారట.

బాబీ కూడా చిరంజీవి సినిమా కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశాడు. కాస్టింగ్ కూడా సెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ని కూడా సంప్రదిస్తున్నాడు. దీనిని బట్టి బాబీ సినిమానే మొదట షూటింగ్ ప్రారంభమవుతుందని అర్థమవుతోంది. వెంకటేష్ తో వెంకీ మామ సినిమా తీసి హిట్ కొట్టిన బాబీ చిరంజీవి సినిమా ని ఎలా మలుస్తారో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -