Tuesday, May 7, 2024
- Advertisement -

సినీ..పద్మవిభూషణ్‌లు వీరే!

- Advertisement -

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 5 గురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి అవార్డులను ప్రకటించగా సినీ రంగం నుండి మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఇక దేశంలోని 2వ అత్యున్నత పురస్కారం అందుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇక సినీ రంగం నుండి ఇప్పటివరకు పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న నటులను పరిశీలిస్తే…2015లో దివంగత బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ పద్మవిభూషణ్ అందుకున్నారు. అదే సంవత్సరం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా పద్మవిభూషణ్ అందుకున్నారు.

ఇక 2016లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, 2011లో టాలీవుడ్ నుండి అక్కినేని నాగేశ్వరరావు, తాజాగా 2024లో మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కరానికి ఎంపికయ్యారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంతమనిషిగా, మీ అన్నయ్యగా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సుల కారణంగానే ఈ అత్యున్నత పురస్కారం వచ్చిందన్నారు. అభిమానుల ప్రేమ,ఆదరణ కారణంగా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు చిరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -