అన్స్టాపబుల్…బాలకృష్ణ హోస్ట్గా ఆహో ఓటిటిలో ప్రసారం అవుతున్న షో. ఈ షోకి ఉన్న రేటింగ్స్ మాములుగా ఉండవు. ఎందుకంటే బాలకృష్ణ హోస్ట్గా వ్యవహారించడం ఒక వంతైతే…గెస్ట్లుగా వచ్చేవారు, వారిని బాలయ్య అడిగే ప్రశ్నలు. ఇప్పటికే సక్సెస్ఫుల్గా రెండు సీజన్లను విజయంతంగా కంప్లీట్ చేసుకుంది.
తాజాగా మూడో సీజన్ని మరింత గ్రాండ్గా లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా షోకి మరింత పాపులారిటీ తెచ్చేందుకు ఈ సీజన్ని మెగాస్టార్ చిరంజీవి లేదా నాగార్జునతో ప్రారంభించనున్నారట. అలాగే మంత్రి కేటీఆర్ సైతం వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
గత రెండు సీజన్లలో ప్రభాస్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా పవన్ ఎపిసోడ్ అయితే రికార్డ్స్ బ్రేక్ అనే చెప్పాలి. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు,షోలతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆయన నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.